చంద్రబాబుతోనే దళితుల సంక్షేమం: సోమిశెట్టి

ABN , First Publish Date - 2022-01-25T05:07:30+05:30 IST

దళితులను ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉంచడంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసినంత కృషి మరే నాయకుడు చేయలేదని కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

చంద్రబాబుతోనే దళితుల సంక్షేమం: సోమిశెట్టి
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 24: దళితులను ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉంచడంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసినంత కృషి మరే నాయకుడు చేయలేదని కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్‌ కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు జేమ్స్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి కోడుమూరు పార్టీ ఇన్‌చార్జి ఆకేపోగు ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి, ఆకెపోగు ప్రభాకర్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో దళితులకు ఎన్నెన్నో వాగ్దానాలు చేశారని, అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ  తుంగలో తొక్కి దళిత ద్రోహిగా మారారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు.  గొంతెత్తి ప్రశ్నించే దళితులపై వైసీపీ ప్రభుత్వం పనిగట్టుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు.  గతంలో డా. సుధాకర్‌ను మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా దారుణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు రాక్షసుల్లా మారారాని, ఎవరైనా వారి అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. పోలీసుల చేత అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ సెల్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు జేమ్స్‌ మాట్లాడుతూ అధికారం చేపట్టేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్‌ కోరితే ప్రజలు నమ్మి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారని, అయితే..  గతంలో ఎవరూ చేయని దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ కమిటీ  అధ్యక్షురాలు ముంతాజ్‌బేగం, బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్రం రామక్రిష్ణుడు, టీఎన్‌ఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బజారన్న, దివ్యాంగుల కమిటీ  ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.


పరిటాల రవీంద్రకు నివాళి


 పరిటాల రవీంద్ర 17వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా  కార్యాలయంలో టీడీపీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దరూర్‌ జేమ్స్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బజారన్న, నందికొట్కూరు టీడీపీ అధికార ప్రతినిధి చిన్న వెంకటస్వామి, నంద్యాల లోక్‌సభ పార్టీ నాయకులు రాజశేఖర్‌, రెడ్డిపోగు బజారన్న  పాల్గొన్నారు.


Updated Date - 2022-01-25T05:07:30+05:30 IST