అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి

ABN , First Publish Date - 2021-10-25T05:20:15+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి
పహిల్వాన్‌ చెరువులో చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే యాదయ్య

షాబాద్‌: సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం షాబాద్‌లోని పహిల్వాన్‌ చెరువులో 6.50లక్షలు, చందనవెళ్లి చెరువు లో 1.5లక్షల చేపపిల్లలను వదలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకం కోసం ప్రతి ఏడాది లక్షల చేపపిల్లలను ఉచితంగా గ్రామాల్లోని చెరువుల్లో వదిలిపెడుతోందని, దీంతో చేపల పెంపకందారులకు ఉపాధి దొరుకుతోందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పథకలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి, సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకట్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T05:20:15+05:30 IST