కల్యాణం.. కమనీయం
ABN , First Publish Date - 2021-03-01T06:27:27+05:30 IST
జిల్లాలో పలు దేవాలయాల్లో స్వామి వార్ల కల్యాణాన్ని శనివారం అర్ధరాత్రి, ఆదివారం వైభ వంగా నిర్వహించారు. మట్టపల్లి లక్ష్మీనరసింహుని క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
మఠంపల్లి/హూజూర్నగర్/మేళ్లచెర్వు/కోదాడటౌన్/ అర్వపల్లి/పెన్పహాడ్, ఫిబ్రవరి 28: జిల్లాలో పలు దేవాలయాల్లో స్వామి వార్ల కల్యాణాన్ని శనివారం అర్ధరాత్రి, ఆదివారం వైభ వంగా నిర్వహించారు. మట్టపల్లి లక్ష్మీనరసింహుని క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. హుజూ ర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గట్టుపై సీతారామచంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా తెల్లవారుజామున ఎదు ర్కోళ్ల ఉత్సవం నిర్వహించి స్వామివారికి కల్యాణం నిర్వహిం చారు. మండలంలోని చౌటపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేణుగోపాలస్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని శనివారం అర్ధరాత్రి జరిగింది. అనంతరం స్వామివారిని ప్రత్యేక వాహనంపై గ్రామ ంలోని పురవీధుల్లో ఊరేగించారు. మేళ్లచెర్వు మండలం కందిబండలో చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలోని కల్యాణ మండపంలో భూనీలా సహితచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవాన్ని శనివారం అర్ధరాత్రి మేళతాళాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. కోదాడలోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాస కల్యాణాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొని పూజలు చేశారు. ఫణిగిరిలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పూజల్లో పాల్గొన్నారు. అర్వపల్లి యోగనంద లక్ష్మీనర్సింహ్మస్వామి తిరు కల్యాణం శనివారం అర్థరాత్రి కన్నుల పండుగగా నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, ఎంపీ పీ మన్నె రేణుకలక్ష్మీనర్సుయాదవ్, గుజ్జ యుగేందర్రావు పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. పెన్పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలో లక్ష్మీ తిరుప తమ్మ గోపయ్యస్వామి జాతర మహోత్సవాన్ని రెండు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించినట్లు దేవాలయ చైర్మన్ గుర్రం అమృతరెడ్డి, వైస్ చైర్మన్ దేశగాని రాజీవ్గాంధీ, సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకట్రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ వెన్న సీతారాంరెడ్డి తెలిపారు.