అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-18T05:08:31+05:30 IST

ప్రభుత్వమందించే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే
నందిమండలంలో ఆర్‌బీకే కేంద్రం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

పెండ్లిమర్రి, జూన్‌ 17: ప్రభుత్వమందించే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని తుమ్మలూరు, కొండూరు, నందిమండలం, కొత్తగంగిరెడ్డిపల్లె, తిప్పిరెడ్డిపల్లె, పెండ్లిమర్రి, దమ్మనపల్లె గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా నందిమండలం గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జూలై 8న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ జయంతి ఉందని, అప్పటికల్లా రైతుభరోసా కేంద్రాల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. మాట ఇచ్చిన ప్రకారం సీఎం రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేశారని, గ్రామ సచివాలయాలు పటిష్టంగా ఉన్నప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజు, ఎంపీడీవో అల్తా్‌ఫహుసేన్‌, వైసీపీ మండల కన్వీనరు చంద్రరెడ్డి, సర్పంచ్‌లు రామ్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలు అమర్‌నాథరెడ్డి, జడ్పీటీసీ బాలయ్య, మాజీ మండల ఉపాధ్యక్షులు నాగమల్లారెడ్డి, రాజారెడ్డి, చావలి శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:08:31+05:30 IST