ఎయిర్పోర్టులో తరుణ్చుగ్కు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2022-06-29T05:16:47+05:30 IST
బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ఛుగ్కు
శంషాబాద్ రూరల్, జూన్ 28 : బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ఛుగ్కు ఆపార్టీ నేతలు మంగళవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు బీజేపీ నేత తూళ్ల వీరేందర్గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, డాక్టర్ ప్రేంరాజ్, మహిళ నేతలు హారతిఇచ్చి స్వాగతం పలికారు. వచ్చేనెల 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంతో శంషాబాద్ విమానాశ్రయంలో వీవీఐపీ కోసం అరైవల్ ప్రాంతంలో ప్రత్యేక విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేయగా ఆయన పరిశీలించారు. బీజేపీనేతలు విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్న పనులను శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి పరిశీలించారు. రేపటి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వీవీఐపీల రాకపోకలు సాగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. వీరేందర్గౌడ్ గత రెండురోజుల నుంచి ఎయిర్పోర్టు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.