లోకేష్కు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2022-05-21T05:58:07+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు లోకేష్ వచ్చారు. జిల్లా మీదుగా కాన్వాయ్లో రాజాం వెళ్లగా.. ఆయనకు ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ వద్ద, పొందూరులోనూ ఘన స్వాగతం లభించింది.
ఎచ్చెర్ల/పొందూరు(ఆమదాలవలస),
మే 20: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్కు టీడీపీ
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం విజయనగరం
జిల్లా రాజాంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు లోకేష్ వచ్చారు.
జిల్లా మీదుగా కాన్వాయ్లో రాజాం వెళ్లగా.. ఆయనకు ఎచ్చెర్ల మండలం
చిలకపాలెం జంక్షన్ వద్ద, పొందూరులోనూ ఘన స్వాగతం లభించింది. చిలకపాలెం
జంక్షన్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్నాయుడు
ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు పుష్ఫగుచ్ఛాలు అందజేశారు.
పొందూరు అంబేడ్కర్ కూడలిలో జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కూన రవికుమార్,
ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో పాటు
టీడీపీ నాయకులు లోకేష్ను కలిశారు. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు,
అభిమానులు తరలిరావడంతో అంబేడ్కర్ కూడలి కిక్కిరిసిపోయింది. లోకేష్
అందరికీ అభివాదం చేస్తూ.. కార్యకర్తల్లో జోష్ నింపారు. అనంతరం రాజాం
వెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీవీ రమణారెడ్డి, మండల టీడీపీ
అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్, లంక గాంధీ, రవి,
అన్నెపు భువనేశ్వరరావు, పైడి అన్నంనాయుడు, గాలి వెంకటరెడ్డి, మెండ
రాజారావు, బచ్చు కోటిరెడ్డి, గట్టెం శివరామ్, గాడు రామారావు తదితరులు
ఉన్నారు.