ప్రాచీన ఆలయాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-05-19T05:45:25+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రాచీన ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ప్రాచీన ఆలయాల అభివృద్ధికి కృషి
విలేకరులతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి

రాయదుర్గంటౌన, మే 18: రాష్ట్రవ్యాప్తంగా ప్రాచీన ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రసన్న వెంకటరమణ స్వామి కల్యాణోత్సవంకు హాజరైన ఆయన బుధవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తుల కోరిక మేరకు కల్యాణమండపం, పార్కు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-19T05:45:25+05:30 IST