చంద్రబాబుకు ఘనస్వాగతం పలుకుదాం

ABN , First Publish Date - 2022-05-19T05:44:14+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షుడు నారాచంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపు నిచ్చారు.

చంద్రబాబుకు ఘనస్వాగతం పలుకుదాం
మాట్లాడుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల సునీత 

రామగిరి, మే 18: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షుడు నారాచంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపు నిచ్చారు. రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఆమె స్వగృహంలో చంద్రబాబు పర్యటనపై నాయకులతో చర్చించారు. ఈనెల19న జిల్లాకేంద్రానికి చంద్రబాబు వస్తారని, 20న చెన్నేకొత్తపల్లి మీదుగా సోమందేపల్లికి వెళ్తారన్నారు. కావున అధినేత చంద్ర బాబుకు రాప్తాడు నియోజకవర్గంలో ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని పార్టీనాయకులకు సూచించారు. రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్‌ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 1.30గంటలకు అందరూ రాప్తాడుకు చేరుకోవాలని సూచించారు. అలాగే చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో స్వాగతం పలక డానికి చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల నుంచి అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రామగిరి మండల కన్వీనర్‌ కురుబ సుధాకర్‌తోపాటు పార్లమెంట్‌ బీసీసెల్‌అధ్యక్షుడు బడముద్దల రంగయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామ్మూర్తినాయుడు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T05:44:14+05:30 IST