చంద్రబాబుకు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2020-05-26T08:42:41+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం మధ్యాహ్నం రాష్ట్రంలోకి ప్రవేశించగానే గరికపాడు నుంచి చిల్లకల్లు వరకు జాతీయ ..

చంద్రబాబుకు ఘనస్వాగతం

జగ్గయ్యపేట రూరల్‌, మే 25 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం మధ్యాహ్నం రాష్ట్రంలోకి ప్రవేశించగానే గరికపాడు నుంచి చిల్లకల్లు వరకు జాతీయ రహదారిపై టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గరికపాడు, ఫుడ్‌ప్లాజా, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, నాయకులు ఆచంట సునీత, కళ్యాణం కోటేశ్వరరావు ఆయనకు స్వాగతం పలికారు. 


ఇబ్రహీంపట్నం : హైదరాబాద్‌ నుంచి అమరావతికి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు  గుంటుపల్లి వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అమృతలూరి వెంకట్‌ అనే అభిమాని అరచేతిలో హారతికర్పూరం వెలిగించుకొని స్వాగతం పలికాడు.


గొల్లపూడి : మాజీ సీఎం చంద్రబాబుకు వన్‌ సెంటర్‌ వద్ద నాయకులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. నర్రా వాసు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-26T08:42:41+05:30 IST