కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2022-01-27T20:20:33+05:30 IST
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సనాతన ధర్మ ప్రచార పరిషత్లో
తిరుపతి: కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సనాతన ధర్మ ప్రచార పరిషత్లో భాగంగా ప్రతి ఆలయంలో గోపూజ నిర్వహించాలని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నమామి గోవిందా పేరుతో గో ఆధారిత ఉత్పత్తుల తయారీ చేస్తామని తెలిపారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ సంస్థ సహకారంతో తయారీ చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రత కోసం 15 కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుందామన్నారు. రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.