అనాథాశ్రమంలో వివాహ వైభోగం

ABN , First Publish Date - 2021-03-04T05:16:21+05:30 IST

నెల్లూరులోని వాత్సల్య అనాథ శరణాలయం వారు పెంచి పెద్ద చేసిన భవానీ అనే యువతి వివాహం బుధవారం ఆ అనాఽథ శరణాలయంలో వైభవంగా జరిగింది.

అనాథాశ్రమంలో వివాహ వైభోగం
భవానీ దంపతులకు బహుమతి అందచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు

దీవించిన ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు(హరనాథపురం), మార్చి 3 : నెల్లూరులోని వాత్సల్య అనాథ శరణాలయం వారు పెంచి పెద్ద చేసిన భవానీ అనే యువతి వివాహం బుధవారం ఆ అనాథ శరణాలయంలో వైభవంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను దీవించారు. అలాగే పలు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా హాజరై భవానీకి బహుమతులు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనహిత-వాత్సల్య సంస్థ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జీవీ సాంబశివరావు, సామంతు గోపాల్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్‌ ఇందిర, సీహెచ్‌వోఎస్‌ శైలజ, డాక్టర్‌ ప్రసన్నాంజనేయరెడ్డి, పగడాల సుశీలమ్మ, పీహెచ్‌ఎన్‌ఎల్‌ విజయలక్ష్మి, పరిమళ, ప్రపుల్ల, ఎస్కే జలీల్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T05:16:21+05:30 IST