బ్యాండ్- బాజా లేదు... ఊరేగింపు ఊసేలేదు... 17 నిముషాల్లో ముగిసిన పెళ్లి!
ABN , First Publish Date - 2021-05-15T15:29:33+05:30 IST
యూపీలోని షాజహన్పూర్ జిల్లాలోని కలాన్ తహసీల్...
షాజహన్పూర్: యూపీలోని షాజహన్పూర్ జిల్లాలోని కలాన్ తహసీల్ పరిధిలోని పట్నా దేవ్కలి శివాలయంలో కరోనా ఆంక్షల మధ్య ఒక వివాహ వేడుక జరిగింది. కేవలం 17 నిమిషాల్లో వధూవరులు ఏడు అడుగులు వేసి వివాహ తంతు ముగించారు. బ్యాండ్- బాజా లేదు... ఊరేగింపు ఊసేలేదు అన్నట్టు ఈ వివాహ వేడుక జరిగింది. స్థానిక బీజేపీ నేత పుష్పిందర్ దుబే, ప్రీతి దుబేల వివాహం చాలా సింపుల్గా జరిగింది. ఈ వివాహ వేడుక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివాహ వేడుకకు హాజరైన అతిథులతో సహా వధూవరులు వరకట్న విధానాన్ని వ్యతిరేకిస్తూ యువతకు మంచి సందేశం ఇచ్చారు. వరకట్న దురాచారం చాలా కుటుంబాల్లో చిచ్చుపెట్టిందని, దీనికి అందరూ స్వస్తి పలకాలని వధువు ప్రీతి పిలుపునిచ్చారు.