బ్యాండ్- బాజా లేదు... ఊరేగింపు ఊసేలేదు... 17 నిముషాల్లో ముగిసిన పెళ్లి!

ABN , First Publish Date - 2021-05-15T15:29:33+05:30 IST

యూపీలోని షాజహన్‌పూర్ జిల్లాలోని కలాన్ తహసీల్...

బ్యాండ్- బాజా లేదు... ఊరేగింపు ఊసేలేదు... 17 నిముషాల్లో ముగిసిన పెళ్లి!

షాజహన్‌పూర్: యూపీలోని షాజహన్‌పూర్ జిల్లాలోని కలాన్ తహసీల్ ప‌రిధిలోని పట్నా దేవ్‌క‌లి శివాలయంలో క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య ఒక వివాహ వేడుక జ‌రిగింది. కేవలం 17 నిమిషాల్లో వధూవరులు ఏడు అడుగులు వేసి వివాహ తంతు  ముగించారు. బ్యాండ్- బాజా లేదు... ఊరేగింపు ఊసేలేదు అన్న‌ట్టు ఈ వివాహ వేడుక‌ జ‌రిగింది. స్థానిక బీజేపీ నేత పుష్పిందర్ దుబే, ప్రీతి దుబేల వివాహం చాలా సింపుల్‌గా జ‌రిగింది. ఈ వివాహ వేడుక స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివాహ వేడుకకు హాజరైన అతిథులతో సహా వధూవరులు వరకట్న విధానాన్ని వ్యతిరేకిస్తూ యువతకు మంచి సందేశం ఇచ్చారు. వరకట్న దురాచారం చాలా కుటుంబాల్లో చిచ్చుపెట్టింద‌ని, దీనికి అంద‌రూ స్వ‌స్తి ప‌ల‌కాలని వ‌ధువు ప్రీతి పిలుపునిచ్చారు.



Updated Date - 2021-05-15T15:29:33+05:30 IST