పెళ్లికి అతిథిగా వచ్చిన ఈ మహిళకు.. రూ.32 లక్షల జరిమానా చెల్లించిన వరుడి కుటుంబం.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-09-18T19:31:40+05:30 IST
ఆమె పేరు గోసియా ఆంటోనీ.. ఆమె ఐదేళ్ల క్రితం ఓ పెళ్లికి అతిథిగా వెళ్లింది..
ఆమె పేరు గోసియా ఆంటోనీ.. ఆమె ఐదేళ్ల క్రితం ఓ పెళ్లికి అతిథిగా వెళ్లింది.. పబ్లో జరిగిన పెళ్లి వేడుకలో విందు ఆరగించింది.. అనంతరం అక్కడి డ్యాన్స్ ఫ్లోర్పై చిందులేసేందుకు వెళ్లింది.. అయితే అక్కడ ఆమె జారిపడిపోవడంతో ఎడమ తొడ ఎముక విరిగిపోయింది.. దీంతో ఆమె పబ్ నిర్వాహకులపై కోర్టుకెక్కింది.. ఆ కేసును విచారించిన కోర్టు ఆంటోనీకి పబ్ యజమానులు రూ.32 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.. ఆ పబ్ వరుడి కుటుంబానికి చెందినదే కావడంతో వారు ఆమెకు భారీ నష్టపరిహారం చెల్లించారు.
పెళ్లి వేదికపై ఫోన్లో వధువు బిజీ.. వరుడి పరిస్థితిపై ఫన్నీ కామెంట్స్..
పొట్టిగా ఉన్నావు.. నీతో కాపురం చేయలేను.. రెండేళ్ల తర్వాత..
లండన్కు చెందిన ఆంటోనీ తన స్నేహితురాలు ఆని రిచర్డ్సన్ పెళ్లి వేడుకకు 2016 సెప్టెంబర్ నెలలో హాజరైంది. వరుడి కుటుంబానికి చెందిన `వైట్ హార్స్` పబ్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ విందు ఆరగించిన ఆంటోనీ డ్యాన్స్ ఫ్లోర్పైకి వెళ్లి చిందులేసింది. అయితే ఆ సమయంలో డ్యాన్స్ ఫ్లోర్పై నీరు ఉండడం వల్ల ఆమె జారి కిందపడిపోయింది. దీంతో ఆమె ఎడమ తొడ ఎముక విరిగిపోయింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎముక విరిగిపోవడంతో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు.
పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తాను ప్రమాదానికి గురయ్యానని, డ్యాన్స్ ఫ్లోర్పై ఉన్న నీరు, మద్యం కారణంగా తాను జారిపోయానని, కాబట్టి వారు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆంటోనీ స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి తాజాగా ఆంటోనీకి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఆంటోనీకి పబ్ నిర్వాహకులు రూ.32 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. దీంతో కోర్టు ఆదేశానుసారం వరుడి కుటుంబం ఆంటోనీకి నష్టపరిహారం చెల్లించింది.