గాంధీయిజంపై నేడు వెబినార్
ABN , First Publish Date - 2020-10-02T08:42:33+05:30 IST
గాంధీ జయంతి సంద ర్భంగా నన్నయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ‘రిలవెన్స్ ఆఫ్ గాంధీయిజం..
దివాన్చెరువు, అక్టోబరు 1: గాంధీ జయంతి సంద ర్భంగా నన్నయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ‘రిలవెన్స్ ఆఫ్ గాంధీయిజం ఇన్ టుడేస్ యూత్’ అంశంపై శుక్రవారం నిర్వహించే వెబినార్ను సద్వినియోగం చేసుకో వాలని ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు కోరా రు. దీనికి సంబంధించిన బ్రోచర్ను గురువారం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు మల్లిప్రియ, రాజామణి, పద్మవల్లి, యుఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.