3 రోజులు సాధారణ స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , First Publish Date - 2022-04-04T10:04:05+05:30 IST
రాగల మూడు రోజులు రాష్ట్రంలో సాధారణ స్థాయిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రాగల మూడు రోజులు రాష్ట్రంలో సాధారణ స్థాయిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని, ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.