మాస్క్‌ సామాజిక బాధ్యత

ABN , First Publish Date - 2020-06-17T05:35:31+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు పెరగడం అందరినీ కలవరపెడుతోంది. మాస్క్‌ వినియోగాన్ని సామాజిక బాధ్యతగా భావించకపోవడమే ఈ పరిస్థితికి కారణం అంటోంది తాజా అధ్యయనం...

మాస్క్‌ సామాజిక బాధ్యత

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు పెరగడం అందరినీ కలవరపెడుతోంది. మాస్క్‌ వినియోగాన్ని సామాజిక బాధ్యతగా భావించకపోవడమే ఈ పరిస్థితికి కారణం అంటోంది తాజా అధ్యయనం. కరోనా వైరస్‌ నుంచి రక్షణలో  శానిటైజర్లు, సామాజిక దూరంతో పాటు మాస్క్‌ ధరించడం ఎంతో ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. అయితే మనదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాత్రం మాస్క్‌ వాడకాన్ని సామాజిక బాధ్యతగా భావించడంలేదని అంటున్నారు లండన్‌ శాస్త్రవేత్తలు.


హాంకాంగ్‌ లాంటి చిన్నదేశం ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ 99 శాతం మంది ప్రజలు ఫిబ్రవరి ప్రారరంభం నుంచే మాస్క్‌లు ధరిస్తున్నారు. ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించడం వల్ల కరోనా రోగి నుంచి వైరస్‌ నులుగురి నుంచి ఒక్కరికి మాత్రమే సోకే అవకాశం 75శాతం ఉందని కేంబ్రిడ్జీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘‘లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు పెరుగుతున్న ఈ సమయంలో అందరూ విధిగా ఫేస్‌మాస్క్‌ పెట్టుకోవాలి. ఇంటి వద్ద తయారుచేసుకున్న మాస్కులు కూడా వైరస్‌ సోకకుండా కాపాడతాయి.  మాస్క్‌లకు పెద్ద ఖర్చేమి కాదు. మాస్కులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచడం, వాటిని పెట్టుకోవడం వల్ల కలిగే లాభాన్ని ప్రజలకు వివరించడం ద్వారా మార్పు సాధ్యమవుతుంది. అదొక సామాజిక అలవాటుగా మారినప్పుడే ఫలితం కనిపిస్తుంది’’ అని పరిశోధకులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-06-17T05:35:31+05:30 IST