పరిగిని స్వచ్ఛపట్టణంగా మారుస్తాం

ABN , First Publish Date - 2021-06-18T05:20:40+05:30 IST

పరిగిని స్వచ్ఛపట్టణంగా మారుస్తాం

పరిగిని స్వచ్ఛపట్టణంగా మారుస్తాం
మురికి కాలువలను పరిశీలిస్తున్న చైర్మన్‌ అశోక్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

పరిగి : పరిగి మునిసిపాలిటీని స్వచ్ఛపట్టణంగా మారుస్తామని మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌ అన్నారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్యతో కలిసి పట్టణంలోని   2, 3వ వార్డుల్లో పర్యటించారు. నర్సరీల్లోని మొక్కలను పరిశీలించారు. చైర్మన్‌ మాట్లాడుతూ, గతేడాది లక్ష మొక్కలు నాటామని, ఈసారి మరో 50వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా పెద్ద మురికికాలువలను బుల్‌డోజర్లతో శుభ్రం చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రవీంద్ర, వెంకటేశ్‌, కిరణ్‌, నాయకులు రవి, తాహిర్‌అలీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:20:40+05:30 IST