నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ABN , First Publish Date - 2021-07-27T04:57:06+05:30 IST
పెద్దవాగు వరద ఉధృతివల్ల పంటనష్టపోయిన రైతులను ఆదుకుంటా మని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.
- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
పెంచికలపేట, జూలై 26: పెద్దవాగు వరద ఉధృతివల్ల పంటనష్టపోయిన రైతులను ఆదుకుంటా మని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం ఎల్లూరు, పెంచికలపేట, ఆగర్గూడ గ్రామాల్లో పెద్ద వాగు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతులు అధైర్యపడొ ద్దని వ్యవసాయశాఖ అధికారులతో పంటనష్టాన్ని అంచనా వేయించి నివేదికలు తయారు చేస్తామ న్నారు. ఏవో రాజులనాయుడు, సర్పంచ్లు శ్రీనివాస్, సంజీవ్, ఎంపీటీసీ రాజన్న ఉన్నారు.