లాలూనాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-07-06T11:04:11+05:30 IST

రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లాలూనాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని శాసనమండలి చైర్మన్‌ గుత్తా

లాలూనాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం

నమండలి చైర్మన్‌ గుత్తా, మంత్రి జగదీ్‌షరెడ్డి


చందంపేట, జూలై 5 : రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లాలూనాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి బిల్డింగ్‌తండా వద్ద ఈ నెల 4వ తేదీన జరిగిన కాంగ్రెస్‌ - టీఆర్‌ఎస్‌ వర్గీయుల మధ్య ఘర్షణలో రైతు సమన్వయసమితి చందంపేట మండల అధ్యక్షుడు రమావత్‌ లాలునాయక్‌ మృతి చెందాడు. ఆయన కుటుంబసభ్యులను సుఖేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘర్షణలో లాలునాయక్‌ మృతిచెందడం దురదృష్టకరమని, అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ పర్యటనలో నల్లగొండ జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T11:04:11+05:30 IST