భూ కబ్జాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలను అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2021-06-21T05:12:09+05:30 IST

రాజంపేట నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతూ టీడీపీకి చెందిన వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారని వారి ఆగడాలను అడ్డుకుంటామని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయులు హెచ్చరించారు.

భూ కబ్జాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలను అడ్డుకుంటాం
బోయనపల్లెలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలిస్తున్న బత్యాల చెంగల్‌రాయులు

 రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్యాల  

రాజంపేట, జూన్‌20 : రాజంపేట నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతూ టీడీపీకి చెందిన వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారని వారి ఆగడాలను అడ్డుకుంటామని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయులు హెచ్చరించారు. ఆదివారం రాజంపేట మండలం తాళ్లపాక పంచాయతీ బోయనపల్లె ప్రాంతంలో కొంత మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన టి.వెంకటసుబ్బయ్య స్థలాన్ని కబ్జా చేసి దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పదంగా మారిన ఆ స్థలాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేటలో వైసీపీ నేతలు అభివృద్ధి మరిచి ప్రభుత్వ భూములను ఆక్రమించడం, డీకేటీ భూములను అక్రమాలను చేయడం, పేదల భూములను కబ్జా చేయడం, భూ కబ్జాలనే ఆదాయ వనరుగా మార్చుకోవడం జరిగిందన్నారు. వైసీపీ ఆక్రమణలను ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోవూరు సుబ్రహ్మణ్యంనాయుడు, బోయనపల్లె మాజీ ఎంపీటీసీ అద్దె ప్రతా్‌పరాజు, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ పార్లమెంట్‌ అధ్యక్షుడు రేవూరి వేణుగోపాల్‌, బీసీ నాయకులు ఇడిమడకల కుమార్‌, స్థానిక నాయకులు నరసింహులు, మురళీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:12:09+05:30 IST