ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-07-26T05:20:40+05:30 IST

ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం

ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం
ఆర్థికసాయం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

దోమ: ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుర్వ శ్రీశైలం కుటుంబాన్ని, అదే విధంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించి రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికి అండగా ఉంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అశోక్‌రెడ్డి, నాయకులు రాజేందర్‌గౌడ్‌, హన్మంతు, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T05:20:40+05:30 IST