పంచాయతీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం

ABN , First Publish Date - 2021-01-26T06:26:38+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ మద్దతుతో వంద శాతం సర్పంచ్‌ స్థానాలను గెలిపించుకుని విజయ ఢంకా మోగిస్తామని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం
వైసీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే బాబూరావు

  ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

పాయకరావుపేట, జనవరి 25 : పంచాయతీ ఎన్నికల్లో  నియోజకవర్గంలో వైసీపీ మద్దతుతో వంద శాతం సర్పంచ్‌ స్థానాలను గెలిపించుకుని విజయ ఢంకా మోగిస్తామని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. మండలంలోని పాల్తేరుకు చెందిన గోసల కృష్ణ, బద్రీనాద్‌తో పాటు రాజగోపాలపురానికి చెందిన వై.లోవరెడ్డి ఆధ్వర్యంలో పులువురు సోమవారం వైసీపీలో చేరిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడారు.  పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం  నుంచి గ్రీన్‌ సిగ్నల్స్‌ వచ్చిన వెంటనే  సిద్ధమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్టీ నాయకులు ధనిశెట్టి బాబూరావు, గూటూరు శ్రీనివాసరావు, దగ్గుపల్లి సాయిబాబా, చోడిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T06:26:38+05:30 IST