మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతాం

ABN , First Publish Date - 2020-09-30T11:59:18+05:30 IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పి కొడతామని వామపక్ష నేతలు పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతాం

నిరసన దీక్షలో వామపక్ష నేతలు


నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 29 : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పి కొడతామని వామపక్ష నేతలు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  మంగళవారం వామపక్ష నేతలు నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.  సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు చండ్ర రాజగోపాల్‌, ప్రభాకర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌లో సంఖ్యా బలం ఉందని రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. రైతుల హక్కుల కోసం దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నామని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు రామరాజు, షాన్‌వాజ్‌, వాటంబేటి నాగేంద్ర, సీపీఎం నేతలు శ్రీరాములు, పొట్టేపాళెం చంద్రమౌళి, కటికాల వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-30T11:59:18+05:30 IST