నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు నమోదు చేస్తాం
ABN , First Publish Date - 2022-01-21T06:22:38+05:30 IST
ఆలేరు నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు నమోదు చేస్తామని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ బీర్ల ఐలయ్య, సభ్యత్వ నమోదు ఎన్రోలర్స్ ఇన్చార్జి పసుపుల ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పొందిన ప్రతి కార్యకర్తకు రూ.2లక్షల బీమా ఉంటుందని, పార్టీ వారిక అండ
యాదాద్రి రూరల్, జనవరి 20: ఆలేరు నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు నమోదు చేస్తామని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ బీర్ల ఐలయ్య, సభ్యత్వ నమోదు ఎన్రోలర్స్ ఇన్చార్జి పసుపుల ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పొందిన ప్రతి కార్యకర్తకు రూ.2లక్షల బీమా ఉంటుందని, పార్టీ వారిక అండగా నిలుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు కానుగు బాలరాజ్గౌడ్, గుండ్లపల్లి భరత్గౌడ్, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గుడ్ల వరలక్ష్మి, గుండు నర్సింహ్మగౌడ్, గుండ్లపల్లి నర్సింహ్మగౌడ్, సాంబేష్, సలాం తదితరులు పాల్గొన్నారు.