నీ బాగోతం బయట పెడతాం.. కటకటాల్లోకి పంపుతాం

ABN , First Publish Date - 2022-05-21T04:22:10+05:30 IST

‘నీ బాగోతం బయట పెడతాం.. కటకటాల్లోకి పంపుతా’ మని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

నీ బాగోతం బయట పెడతాం.. కటకటాల్లోకి పంపుతాం
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ

- డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ 


అచ్చంపేటటౌన్‌, మే 20: ‘నీ బాగోతం బయట పెడతాం.. కటకటాల్లోకి పంపుతా’ మని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతీ యువకులకు ఉచిత కోచింగ్‌ ఇప్పిస్తున్నా నని గొప్పలు చెప్పకుంటున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ డబ్బులు ఎవరివని నిలదీశారు. మినరల్‌ డెవలప్‌ ఫండ్‌ ద్వారా మొత్తం రూ.4 కోట్ల 50 లక్షలు డ్రా చేశారన్నారు. స్కిల్‌ డవలప్‌మెంట్‌ ద్వారా రూ.కోటీ 50 లక్షలు డ్రా చేసి, రూ.20లక్షలు కోచింగ్‌కోసం ఖర్చు చేశారు. మిగతా రూ.కోటీ 30లక్షలు ఎక్కడ పోయాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నేను ఎవరితోనో రూ.2లక్షలు తీసుకొని ఎగ్గొట్టానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయా లకు దూరంగా ఉంటానని సవాల్‌ చేశారు. మైనింగ్‌, వైనింగ్‌, భూకబ్జాలు చేసి బెం గళూరులో రూ.4కోట్లతో ప్లాట్ల వ్యాపారంతో కరీంనగర్‌తో పాటు అచ్చంపేట చివరి చా రగొండలో కూడా భూకబ్జాలు చేసి రియల్‌ ఎస్టేట్‌ చేసేది ఎవరో ప్రజలకు తెలుసు నన్నారు.  నల్లమల్ల ముద్దుబిడ్డవు కాదు కదా అద్దె బిడ్డవు అని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసి భూములను లాక్కుంటున్నాడని ఆయన అన్నారు. నియోజకవర్గంలో నీవు వేసిన శిలాఫలకాలకు మేం దండలు వేస్తామన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే  ఆరోపణలు మాని అభివృద్ధి చేయకపోతే మేమెంటో చూపిస్తామని అన్నారు. నాయకులు గౌరిశంకర్‌, రఘురాం, వెంకట్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-21T04:22:10+05:30 IST