రూ.3కోట్లతో బస్టాండ్‌ను ఆధునీకరిస్తాం

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

రూ.3కోట్లతో బస్టాండ్‌ను ఆధునీకరిస్తాం

రూ.3కోట్లతో బస్టాండ్‌ను ఆధునీకరిస్తాం
చేవెళ్ల బస్టాండ్‌లో మాట్లాడుతున్న ఎంపీ రంజిత్‌రెడ్డి

చేవెళ్ల, జూలై 1: చేవెళ్ల ఆర్టీసీ బస్టాండ్‌ను రూ.3 కోట్లతో ఆధునీకరిస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో శుక్రవారం ఆయన పర్యటించి ప్రయాణికులతో మాట్లాడారు. బస్టాండ్‌కు నిధులు మంజూరైన సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు టపాసులు కల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, శంకర్‌పల్లి ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, చేవెళ్ల, మొయినాబాద్‌ మండలాల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్‌, మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎర్ర మల్లేశ్‌, నియోజకవర్గం యూత్‌ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అఽధ్యక్షుడు శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మండల సీనియర్‌ నాయకులు ఎం.రమాణారెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, సర్పంచ్‌ ఎం.మోహన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైఎస్‌ చైర్మన్లు మాణిక్యరెడ్డి, బి.నర్సింహులు, నాయకులు చింటు, నర్సింలు, నరేందర్‌గౌడ్‌, రవీందర్‌, నర్సింలు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST