ప్రభుత్వ ముద్రణాలయాలను ఆధునీకరిస్తాం: ఎబీ వెంకటేశ్వర రావు

ABN , First Publish Date - 2022-06-27T21:41:50+05:30 IST

కర్నూలు: కర్నూలు, విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయాలను ఆధునీకరిస్తామని ప్రిటింగ్, స్టేషనరీ కమిషనర్ ఎబీ వెంకటేశ్వర రావు తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయాన్ని

ప్రభుత్వ ముద్రణాలయాలను ఆధునీకరిస్తాం: ఎబీ వెంకటేశ్వర రావు

కర్నూలు: కర్నూలు, విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయాలను ఆధునీకరిస్తామని ప్రిటింగ్, స్టేషనరీ కమిషనర్ ఎబీ వెంకటేశ్వర రావు తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయాన్ని పరిశీలించాక ఆయన మాట్లాడారు. ముద్రణ యంత్రాల పనితీరును సిబ్బందిని అడిగి  తెలుసుకున్నారు. ముద్రణ యంత్రాలయంలో నిపుణులైన సిబ్బంది ఉన్నా.. వారికి సరిపడా పనిలేదన్నారు. కొన్ని యంత్రాలు బాగున్నాయని, మరికొన్ని తుప్పు పట్టాయని తెలిపారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో పని కల్పించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 

Updated Date - 2022-06-27T21:41:50+05:30 IST