2,3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తాం: మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-03-16T21:58:21+05:30 IST
రాబోయే 2,3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి
హైదరాబాద్: రాబోయే 2,3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో పలు ప్రాంతాల్లో వివిధ పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సావాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో వరద ముంపు సమస్య పరిష్కారానికి రూ.103 కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో వరద ముంపు సమస్య పరిష్కారానికి రూ.వెయ్యి కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. రూ.2,500 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. అలాగే ఎల్బీ నగర్లో భూ రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తామని కేటీఆర్ తెలిపారు.