డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేవరకు పోరాడుతాం
ABN , First Publish Date - 2022-05-21T04:45:15+05:30 IST
పట్టా స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేవరకు పోరాడుతామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మాకం రాం మోహన్ అన్నారు.
మహబూబ్నగర్(కలెక్టరేట్), మే 20: పట్టా స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేవరకు పోరాడుతామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మాకం రాం మోహన్ అన్నారు. ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు కోల్పోయిన నిర్వాసితులందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అధికారులు పేదలకు ఇళ్ల స్థలాలను చూపిస్తూ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇస్తా మని ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు తీసేసుకున్నారని వాపయారు. నాలుగేళ్లు గడిచినా నిర్వాసితు లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, ఇప్పటికైనా నిర్వాసితులందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు.