రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించే వరకూ పోరాడుతాం

ABN , First Publish Date - 2021-02-26T05:52:28+05:30 IST

జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రైల్వే గేటు వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు.

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించే వరకూ పోరాడుతాం
జిల్లా కేంద్రంలోని రైల్వే గేటు వద్ద ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఆదిలాబాద్‌అర్బన్‌, ఫిబ్రవరి 25: జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రైల్వే గేటు వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాజిద్‌ఖాన్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని కేవలం ఈ ఓవర్‌ బ్రిడ్జిని ఓట్ల కోసమే వాడుకుంటున్నారని గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దిగంబర్‌రావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యాసంగ్‌నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:52:28+05:30 IST