పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తాం

ABN , First Publish Date - 2021-04-17T06:44:00+05:30 IST

పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తాం
నకిరేకల్‌లో గులాబీ కండువా కప్పి కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న రాజ్యసభ సభ్యుడు బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్‌, ఏప్రిల్‌ 16 : పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మీనర్సయ్య,  స్వర్ణకారుల సంఘం నాయకుడు చింతోజు శంకరాచారి ఆధ్వర్యంలో పలువురు శుక్రవారం వారి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో 20వార్డులకు గాను 20టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. కార్యక్రమంలో గంజి ఎల్లయ్య, చిలుకూరి సుధాకర్‌, గురుమూర్తి, సతీష్‌ పాల్గొన్నారు.  
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
కట్టంగూర్‌  : మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన బసవో జు ఝూన్సీకి వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమెకు అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, మండల అధ్యక్షు డు ఏడుకొండలు, సర్పంచ్‌లు దాసరి సంజయ్‌, గుర్రం సైదులు, నాయకులు గడు సు సుధీర్‌రెడ్డి, చెరుకు నర్సింహ, అంతటి శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:44:00+05:30 IST