కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి
ABN , First Publish Date - 2021-06-13T05:17:29+05:30 IST
కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు.
శ్రీకాళహస్తి అర్బన్, జూన్ 12: కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని అన్నింటా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. రాక్మెన్ ఫౌండేషన్ సంస్థ 50 ఆక్సిజన్ సిలిండర్లను వితరణగా ఇవ్వడంతో, శనివారం వీటిని ఎమ్మెల్యే ఆస్పత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైద్యసిబ్బంది ప్రాణాలు లెక్కచేయకుండా కొవిడ్ బాధితులకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రూ.12కోట్ల నిధులతో ఆస్పత్రి అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. రానున్నరోజుల్లో ఖరీదైన వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీఇచ్చారు. త్వరలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేస్ చంద్రమోహన్, వైద్యులు హిమదేవి, కిరణ్, లక్ష్మీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.