ఢిల్లీ బలగాలను దింపుతాం: ఎంపీ అర్వింద్‌

ABN , First Publish Date - 2020-11-28T08:03:17+05:30 IST

‘‘మజ్లి్‌సకు అమ్ముడు పోయిన కేసీఆర్‌, కేటీఆర్‌.. రాష్ట్రంలో హిందువుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

ఢిల్లీ బలగాలను దింపుతాం: ఎంపీ అర్వింద్‌

రాజేంద్రనగర్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘మజ్లి్‌సకు అమ్ముడు పోయిన కేసీఆర్‌, కేటీఆర్‌.. రాష్ట్రంలో హిందువుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఉన్నత స్థాయిలో ఉన్న పోలీసోళ్లు కేసీఆర్‌కు వత్తాసు పలుకుతున్నారు. ఇలాగైతే ఢిల్లీ నుంచి పారా మిలటరీ బలగాలు దిగుతాయి’’ అని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హెచ్చరించారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌లోని బుద్వేల్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మార్చిలో జరగాల్సిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దుబ్బాక భయంతో డిసెంబరులోనే పెడుతున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతదని, అప్పుడు ఆ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరని జోస్యం చెప్పారు.


‘‘బీజేపీ గెలిస్తే అగ్గి రాజుకుంటుందని సీఎం అంటున్నారు.. అవును అగ్గి రాజేస్తాం... కేసీఆర్‌  ఫామ్‌హౌస్‌లో అగ్గి రాజేస్తాం.. అగ్గి రాయడానికే పిడుగుల్లాంటి యువత ఉంది’’ అని వ్యాఖ్యానించారు. వరదల వేళ రాని బీజేపీ నాయకులు ఇప్పుడు వస్తున్నారంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీ నేత స్వామీగౌడ్‌ మాట్లాడుతూ సరిహద్దుల్లో సైనికులను చంపుతున్న వారికి, రోహింగ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు.


Updated Date - 2020-11-28T08:03:17+05:30 IST