రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం

ABN , First Publish Date - 2021-10-20T05:02:16+05:30 IST

రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయఢంకా మోగిస్తుందని ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ పోతుగుంట రమే్‌షనాయుడు పేర్కొన్నారు.

రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం
సమావేశంలో ప్రసంగిస్తున్న పోతుగుంట రమే్‌షనాయుడు

 బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు 

రాజంపేట, అక్టోబరు19 : రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల్లో  బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయఢంకా మోగిస్తుందని ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ పోతుగుంట రమే్‌షనాయుడు పేర్కొన్నారు. రాజంపేట బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌  ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఢీకొనడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాజంపేట మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. చిన్నవర్షం కురిసినా రోడ్డుపై నడవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని రాజంపేటలో గెలిపిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు తెప్పించి పట్టణాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ, నాగరాజు, కళావతి, సుభద్ర, సూర్యచంద్ర, అభిరామ్‌, వేణుగోపాల్‌, మహమ్మద్‌ అలీ, రమణ, సునీత, రమణాచారి, నవీన్‌, గోపి పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:02:16+05:30 IST