అధికారంలోకి రాగానే జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం: బండి సంజయ్
ABN , First Publish Date - 2021-09-08T04:04:54+05:30 IST
అధికారంలోకి రాగానే జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం: బండి సంజయ్
సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే పేరు మార్చి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ అన్నారు. మేం అధికారంలోకి రాగానే యూపీ తరహాలో జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తామని, కేసీఆర్కు దమ్ముంటే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.