టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం

ABN , First Publish Date - 2022-07-06T06:15:25+05:30 IST

పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, నాయకులు బొర్రా నాగరాజు, ఎంవీఎస్‌.ప్రసాద్‌ స్పష్టం చేశారు.

టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమలతో పాడేరు నాయకులు

పాడేరు నియోజకవర్గ టీడీపీ నాయకులు


పాడేరు రూరల్‌, జూలై 7: పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, నాయకులు బొర్రా నాగరాజు, ఎంవీఎస్‌.ప్రసాద్‌ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో పార్టీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అందరితో కలిసి పాటుపడతామని, చంద్రబాబును సీఎం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పోలుపర్తి గోవిందరావు, సోమెలి చిట్టిబాబు, గంగపూజారి శివకుమార్‌, బుద్ద జ్యోతికిరణ్‌, కూడి రామునాయుడు, వంతాల కొండలరావు, కిల్లో పూర్ణచందరరావు, గొలిసింగి సత్యనారాయణ, గాడి శ్రీరామ్మూర్తి, తోట దొరబాబు, శరమండ శ్రీధర్‌, పాంగి రాము, కిముడు లక్ష్మయ్య, కొర్రా రామ్మూర్తి, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T06:15:25+05:30 IST