భూనిర్వాసితులకు అండగా ఉంటాం : రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-11T06:49:53+05:30 IST

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాల బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శ

భూనిర్వాసితులకు అండగా ఉంటాం : రాజగోపాల్‌రెడ్డి
చేరిగూడలో ప్రభుత్వ భూములకు సంబంధించిన మ్యాప్‌ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

మర్రిగూడ, ఏప్రిల్‌ 10: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడ  రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాల బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ పరిధిలోని చేరిగూడ సమీపంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూనిర్వాసితులు అధైర్యపడవద్దని, పునరావాసం కోసం ఈ ప్రాం తంలో మ్యాప్‌ను పరిశీలించామని, వారికి త్వరలోనే పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో భూనిర్వాసితులు సర్వం కోల్పోయారని, వీరికి న్యా యం జరిగేందుకు ఇక్కడి ప్రాంతంలో స్థల సేకరణ చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన వెంట బీసీసీ ఉపాధ్యక్షుడు అనంతరాజుగౌడ్‌, మండల అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్‌, పలువురు ప్రజాప్రతినిధులు, భూనిర్వాసితులు ఉన్నారు.

Updated Date - 2021-04-11T06:49:53+05:30 IST