15 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం

ABN , First Publish Date - 2022-08-20T10:16:05+05:30 IST

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిని 15 రోజుల్లో ప్రకటిస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు తెలిపారు.

15 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం

మునుగోడు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రాజగోపాల్‌

ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు


సంస్థాన్‌ నారాయణపురం, ఆగస్టు 19: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిని 15 రోజుల్లో ప్రకటిస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో నిర్వహించిన కాం గ్రెస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.  మునుగోడు  ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని, ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మునుగోడు గడ్డ కాంగ్రె్‌సకు అడ్డా’అన్నారు. కాళేశ్వరం లో కమీషన్లతో సంపాదించిన డబ్బుతో సీఎం కేసీఆర్‌ మునుగోడులో ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. 

Updated Date - 2022-08-20T10:16:05+05:30 IST