సత్యసాయి జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నాం
ABN , First Publish Date - 2022-01-27T06:57:37+05:30 IST
సత్య సాయి జిల్లా ఏర్పాటు ను స్వాగ తిస్తున్నామని అం దుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినం దిస్తున్నామని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి పేర్కొ న్నారు
- మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తిరూరల్, జనవరి 26: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిని జి ల్లా కేంద్రంగా సత్య సాయి జిల్లా ఏర్పాటు ను స్వాగ తిస్తున్నామని అం దుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినం దిస్తున్నామని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి పేర్కొ న్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థాని క టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని ముందు నుండి తాము డిమాండు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాను ఏర్పాటు చేయడంలో ఆర్జే రత్నాకర్ పాత్ర కూడా ఉందన్నారు. సత్యసా యిబాబా అందించిన మహోన్నతసేవలకు గుర్తింపుగా బాబా జన్మదినాన్ని ఆధికారిక సెలవు దినంగా ప్రకటించాలన్నారు. ఆయన భోదనలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఆయన డిమాండు చేశారు. అనంతరం ఆర్వీ జానకీరామయ్య మహాసమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరామిరెడ్డి, పెద రాసు సుబ్రమణ్యం, దారపనేని చంద్రశేఖర్, సామకోటి ఆదినారాయణ, బేకరినా యుడు, సుభచంద్ర, మాలమనోహర్ తదితరులు పాల్గొన్నారు.