పేద కుటుంబాలకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2020-06-06T09:40:26+05:30 IST
లాక్డౌన్లో నిరుపేదలకు అండగా ఉంటామని మంత్రి మల్లారెడ్డి భరోసానిచ్చారు. మండలంలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ
మేడ్చల్: లాక్డౌన్లో నిరుపేదలకు అండగా ఉంటామని మంత్రి మల్లారెడ్డి భరోసానిచ్చారు. మండలంలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం పేదలకు ఆయన బియ్యం, సరుకులను పంపిణీ చేశారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మపర్సన్ లక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, వైస్చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్ మల్లికార్జున్, జైపాల్రెడ్డి, ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, జడ్పీ టీసీ శైలజావిజయేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.