జర్నలిస్టులను అన్ని విధాలా ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-08-10T10:48:52+05:30 IST

జిల్లాలోని జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆదివారం క్యాంపు కార్యాలయంలో జేసీని కలిశారు.

జర్నలిస్టులను అన్ని విధాలా ఆదుకుంటాం

నెల్లూరు (జడ్పీ), ఆగస్టు 9: జిల్లాలోని జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆదివారం క్యాంపు కార్యాలయంలో జేసీని కలిశారు. జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కరోనా సమయంలో వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులతోపాటు జర్నలిస్టులు వీధుల్లోకి వచ్చి విధులు నిర్వహిస్తూ సరైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఈ క్రమంలో కరోనా బారిన పడుతున్నారని తెలిపారు. జర్నలిస్టులకు కరోనా పరీక్షలతోపాటు చికిత్సకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనికి జేసీ స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డును కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-08-10T10:48:52+05:30 IST