పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: నక్కా ఆనందబాబు

ABN , First Publish Date - 2021-07-30T22:27:20+05:30 IST

పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: నక్కా ఆనందబాబు

పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: నక్కా ఆనందబాబు

అమరావతి: కొండపల్లి వెళ్లకుండా పోలీసులు నిరోధిస్తున్నారని ఏబీఎన్‌తో టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్ని అవరోధాలు కలిగించినా కొండపల్లి ప్రాంతాన్ని పరిశీలించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దోపిడీ జరుగుతుంది కాబట్టే పరిశీలనకు వెళ్తున్నామని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. బాక్సైట్ అక్రమాలు బయటపడుతాయని భయపడుతున్నారని ఆనందబాబు చెప్పారు.


మరోవైపు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇంటికి వచ్చి గృహ నిర్భంధంలో ఉండాలని నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి బయటకు రాకుండా తలుపులకు పోలీసులు నోటీసులు అంటిస్తున్నారు. విజయవాడలో బోండా ఉమ, గుంటూరులో నక్కా ఆనంద్ బాబు సహా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు.

Updated Date - 2021-07-30T22:27:20+05:30 IST