రానున్న ఎన్నికలకు సైనికుల్లా పనిచేయాలి
ABN , First Publish Date - 2022-08-12T05:23:57+05:30 IST
స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాడుగుల టౌన్ అధ్యక్షుడు రంజిత్ వర్మ ఆధ్వర్యంలో బూత్ ఇన్చార్జిల సమావేశం గురువారం నిర్వహించారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్
మాడుగుల ఆగస్టు 11: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాడుగుల టౌన్ అధ్యక్షుడు రంజిత్ వర్మ ఆధ్వర్యంలో బూత్ ఇన్చార్జిల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం ఓటరు జాబితాను పరిశీలించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షుడు గొల్లవెల్లి.శ్రీరామ్మూర్తి, కశిరెడ్డి అప్పలనాయుడు, జెల్లి సూర్యప్రకాష్, కర్రి కొండబాబు, తదితరుల పాల్గొన్నారు.