రానున్న ఎన్నికలకు సైనికుల్లా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-08-12T05:23:57+05:30 IST

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాడుగుల టౌన్‌ అధ్యక్షుడు రంజిత్‌ వర్మ ఆధ్వర్యంలో బూత్‌ ఇన్‌చార్జిల సమావేశం గురువారం నిర్వహించారు.

రానున్న ఎన్నికలకు సైనికుల్లా పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పీవీజీ కుమార్‌


టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ 

మాడుగుల ఆగస్టు 11: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాడుగుల టౌన్‌ అధ్యక్షుడు రంజిత్‌ వర్మ ఆధ్వర్యంలో బూత్‌ ఇన్‌చార్జిల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి  ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం ఓటరు జాబితాను పరిశీలించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షుడు గొల్లవెల్లి.శ్రీరామ్మూర్తి, కశిరెడ్డి అప్పలనాయుడు, జెల్లి సూర్యప్రకాష్‌, కర్రి కొండబాబు, తదితరుల పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T05:23:57+05:30 IST