నాణ్యమైన విత్తనకాయలు అందిస్తాం: జేడీఏ
ABN , First Publish Date - 2022-05-21T06:28:45+05:30 IST
ఈ ఏడు ఖరీఫ్లో వేరుశనగ సాగు కోసం రైతులకు నాణ్యమైన విత్తన కాయలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసు కుంటున్నట్లు జేడీఏ శివ నారాయణ పేర్కొన్నారు.
ఓబుళదేవరచెరువు, మే20: ఈ ఏడు ఖరీఫ్లో వేరుశనగ సాగు కోసం రైతులకు నాణ్యమైన విత్తన కాయలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసు కుంటున్నట్లు జేడీఏ శివ నారాయణ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని అల్లాపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్న సహకారసంఘం కార్యాలయంలో నిలువ ఉన్న సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను పరిశీ లించారు. సకాలంలో రైతులకు సబ్సిడీపై విత్తనకాయలను అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యతలేని కాయలను వెనక్కు పంపి, ఆ స్థానంలో నాణ్యమైన కాయలను తెప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం బయో ఫర్టిలైజర్స్ యూనిట్ను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు ఏడీఏ ఎస్ సత్యనారాయణ, డీడీఏ పద్మావతి, మండల వ్యవసాయాధికారి జీరా గణేష్, సర్పంచ వెంకటరమణ, వ్యవసాయ శాఖ సిబ్బంది బాబ్జాన, పవన, సుధాకర్నాయక్, అంజినాయక్ తదితరులు పాల్గొన్నారు.