క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం

ABN , First Publish Date - 2022-01-20T04:29:24+05:30 IST

గ్రామీణ క్రీడాకారు లకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని అందజే స్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం మండలంలోని మర్తిడి గ్రామంలో కుమరంభీం స్మారక వాలీబాల్‌ క్రీడలు ముగియడంతో విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు.

క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం
విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

బెజ్జూరు, జనవరి 19: గ్రామీణ క్రీడాకారు లకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని అందజే స్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం మండలంలోని మర్తిడి గ్రామంలో కుమరంభీం స్మారక వాలీబాల్‌ క్రీడలు ముగియడంతో విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. మంచిర్యాల జట్టు ప్రథమ బహుమతి సాధించగా రూ.20 వేల నగదు, కాటేపల్లి జట్టు ద్వితీయ బహుమతి సాధించగా రూ.10 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటి గ్రామానికి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం కుకుడ, బెజ్జూరు గ్రామాలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, నాయకులు బషరత్‌ఖాన్‌, ఓం ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

- శ్మశాన వాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని రాంనగర్‌ గ్రామపంచాయతీలో నూత నంగా నిర్మించిన శ్మశాన వాటికను బుధవారం ఎమ్మెల్యే కోనేరుకోనప్ప ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మనిషి జీవితంలో చివరిఘట్టమైన అంత్యక్రియల సమయం లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్మశాన వాటికలో అన్నివసతులు కల్పిస్తామన్నారు. కార్యక్ర మంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ శంకర్‌, సర్పంచ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:29:24+05:30 IST