కరోనాపై పోరాటం మన ప్రజాస్వామ్య శక్తిని నిరూపించింది: సీఎం

ABN , First Publish Date - 2020-04-10T22:40:33+05:30 IST

కరోనాపై కలసికట్టుగా మనం చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్యం ఎంత బలమైందో చాటిచెబుతోందని...

కరోనాపై పోరాటం మన ప్రజాస్వామ్య శక్తిని నిరూపించింది: సీఎం

రాంచి: కరోనాపై కలసికట్టుగా మనం చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్యం ఎంత బలమైందో చాటిచెబుతోందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. కరోనా మహమ్మారిని దేశం నుంచి పారద్రోలేందుకు అన్ని రాష్ట్రాలు ఒక్కటై కలసికట్టుగా పనిచేయడం ఎంతో గొప్ప విషయమని ఆయనన్నారు. రాష్ట్రాల వెలుపల చిక్కుకున్న తమ ప్రజలు కష్టాలు పడకుండా ఉండేందుకు సీఎంలందరూ కలిసి కృషి చేస్తున్నారని, ఇది మన ఐకమత్యాన్ని చాటిచెబుతోందని సోరెన్ పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్ విధించేటప్పుడు ప్రధాని రాష్ట్రాలను సంప్రదించలేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా లాక్‌డౌన్ తొలగించాలా.. వద్దా.. అని రాష్ట్రాల అభిప్రాయాలను ఆయన కోరుతోందని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనని సోరెన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-10T22:40:33+05:30 IST