రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం

ABN , First Publish Date - 2020-07-08T10:06:28+05:30 IST

రైతులు పండించే పసుపు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర హార్టీకల్చర్‌ కమిషనర్‌ చిరంజీవిచౌదరి పేర్కొన్నారు.

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం

హార్టీకల్చర్‌ కమిషనర్‌ చిరంజీవిచౌదరి


తాడికొండ, జూలై 7: రైతులు పండించే పసుపు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర  హార్టీకల్చర్‌ కమిషనర్‌ చిరంజీవిచౌదరి పేర్కొన్నారు.  తాడికొండ మండలం కంతేరులోని ఉద్యాన నర్సరీ  క్షేత్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం పసుపు రైతులతో చర్చాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా ఈ సంఘాలకు అవసరమైన యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.


పసుపు పండించే రైతులు యంత్రీకరణను ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం విత్తన ఉత్పత్తి పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ ఉద్యాన ఉప సంచాలకులు ధర్మజ, గుంటూరు ఉద్యాన ఉప సంచాలకులు ఎన్‌.సుజాత, గుంటూరు ఏపీఎంఏపీ పథక సంచాలకులు బి.పద్మావతి,  ఉద్యాన సహాయ సంచాలకులు బీజే బెన్సి,  ఏ.రాజాకృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి తదితరలుఉ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T10:06:28+05:30 IST