ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2021-10-20T05:48:58+05:30 IST

గ్రామాల్లోని ప్రజలకు సర్పంచ్‌లు మెరుగైన సేవలు అందేలా పాటుపడాలని ఎ మ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబు సూచించారు. మంగళవా రం ఒంగోలులోని విజయాభవన్‌లో మండలంలోని పలు వురు సర్పంచ్‌లు ఎమ్మెల్యేను కలిసి గ్రామాల్లోని సమస్య లు, పంచాయతీ నిధులపై చర్చించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
దొడ్డవరప్పాడు సర్పంచ్‌ శ్రీరామమూర్తిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

ఎమ్మెల్యే సుధాకర్‌బాబు


మద్దిపాడు, అక్టోబరు 19 : గ్రామాల్లోని ప్రజలకు సర్పంచ్‌లు మెరుగైన సేవలు అందేలా పాటుపడాలని ఎ మ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబు సూచించారు. మంగళవా రం ఒంగోలులోని విజయాభవన్‌లో మండలంలోని పలు వురు సర్పంచ్‌లు ఎమ్మెల్యేను కలిసి గ్రామాల్లోని సమస్య లు, పంచాయతీ నిధులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి, పారిశుధ్యం, విద్యుత్‌ సమస్యల విషయాల్లో చొరవ చూపి ప్రజలకు ఇ బ్బందులు లేకుండా చేయాలని కోరారు. అనంతరం జి ల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన దొడ్డవర ప్పాడు సర్పంచ్‌ బెజవాడ శ్రీరామమూర్తిని ఎమ్మెల్యే శా లువాతో సత్కరించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ మండవ అప్పారావు, మల్లవరం సర్పంచ్‌ నారా సుబ్బారెడ్డి, ఘడియపూడి సర్పంచ్‌ బొమ్మల రామాంజనే యులు, దూమాటి జనార్దన్‌, తిప్పారెడ్డి కోటిరెడ్డి, పోతి నేని శ్రీనివాసరావు, మోరబోయిన సంజీవరావు, వాకా కో టిరెడ్డి, ఏడుగుండ్లపాడు ఎంపీటీసీ దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-20T05:48:58+05:30 IST