‘నేరరహిత సమాజంలో భాగస్వాములు కావాలి’

ABN , First Publish Date - 2021-02-27T04:37:06+05:30 IST

‘నేరరహిత సమాజంలో భాగస్వాములు కావాలి’

‘నేరరహిత సమాజంలో భాగస్వాములు కావాలి’

కీసర రూరల్‌: నేర రహిత సమాజ రూపకల్పనలో ప్రతిఒక్కరూ భాగ స్వాములు కావాలని కీసర పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. నాగారం మున్సిపాలిటీ ప్రధాన రహదారుల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆ ప్రాంతానికి చెందిన మోకు జగన్మోహన్‌రెడ్డి రూ.లక్షా 50వేలు విలువ గల చెక్కును ఇన్‌స్పెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ నాగారం మున్సిపల్‌ పరిధిలో సుమారు 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్సై వెంకటేష్‌, నాయకులు సుధాకర్‌రెడ్డి, బిక్షపతిగౌడ్‌, రామకృష్ణారెడ్డి, దయాకర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, గోపాల్‌గౌడ్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:37:06+05:30 IST