పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-01-24T05:13:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి యువత కృషిచేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌
హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్వీ, యువజన విభాగం సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌

హుస్నాబాద్‌రూరల్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి యువత కృషిచేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం హుస్నాబాద్‌ పట్టణంలోని వీఎల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల టీఆర్‌ఎస్వీ, యువజన విభాగం, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం కష్టపడి పనిచేసే యువతకు సీఎం కేసీఆర్‌ తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, ఎంపీపీ లకావత్‌ మానస, నేషనల్‌ లేబర్‌ కోఆపరేటివ్‌ సభ్యులు దండుగుల రాజ్యలక్ష్మి, మాజీ మార్కెట్‌ కమిటీచైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్‌, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, యువజన, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:13:51+05:30 IST